-->

ఖండ చలనం - పలక విరూపణ - Surface Motions and Continental Deformation in the Indian Plate and the India

Also Read


భూగోళం విశాలమైన ఖండభాగాలు, సముద్రాలతో నిండి ఉంది. మనం నివసిస్తున్న ఖండాలు, వాటిపై ఉన్న నగరాలు, గ్రామాల ఉనికి స్థిరమని మనం భావిస్తుంటాం. అయితే, ఖండాలు స్థిరంగా ఒకే చోట ఉండవనీ.. అవి చలి స్తున్నాయని... మొట్టమొదటగా జర్మనీకి చెందిన ఆల్ ఫ్రెడ్ వెజనర్ తన ఖండ చలన సిద్ధాంతంలో పేర్కొన్నాడు. ఆ తర్వాత తెరపైకి వచ్చిన పలక విరూపణ సిద్ధాంతం... ఖండాలే కాదు, సముద్రాలు కూడా చలిస్తున్నాయని పేర్కొంటోంది!!
ప్రస్తుతం ఖండం ఉన్న ప్రాంతంలో.. ఒకప్పుడు సముద్రం ఉండేది. నేడు సముద్రాలున్న ప్రాంతాల్లో.... గతంలో ఖండాలుండేవి. మనం నివసిస్తున్న ద్వీపకల్ప భారతదేశం... దాదాపు 250 మిలియన్ సంవ త్సరాల క్రితం ఆస్ట్రేలియా, అంటార్కిటికా, ఆఫ్రికాలతో కలిసి ఉండే ది. ఖండచలన సిద్ధాంతం ప్రకారం... 250 మిలియన్ సంవత్స రాల క్రితం ప్రపంచంలోని ఖండాలన్నీ కలిసి ఒకే మహాఖండం (పాంజి యా)గా ఉండేది. పాంజియాను ఆవరించి మహాసముద్రం (పాంధ లేసా) ఉండేది. టెథీస్ సముద్రం పాంజియాను రెండు భాగాలుగా విభజిస్తుండేది. ఉత్తర అమెరికా, యురేషియా (ద్వీపకల్ప భారతం మినహా)లతో కూడిన ఉత్తర పాంజియాను.. 'అంగారా లాండ్' (లారె న్షియా)గా పిలుస్తారు. దక్షిణ అమెరికా, ఆఫ్రికా, ఆస్ట్రేలియా, అంటా ర్కిటికా, ద్వీపకల్ప భారతదేశాలతో కూడిన దక్షిణ పాంజియా భాగా న్ని... 'గోండ్వానా' అని అంటారు.

ప్రత్యేక ఖండాలుగా:

సుమారు 250 మిలియన్ సంవత్సరాల క్రితం పాంజియా చిన్న చిన్న ముక్కలుగా ఉండేది. అయితే, దీనికి కారణమైన బలాలను వెజనర్ సరిగా వివరించలేకపోయాడు. కొన్ని ఖండభాగాలు పశ్చిమంగా చలిం చగా... కొన్ని ఖండభాగాలు భూమధ్యరేఖ వైపు కదిలిపో యాయి. ఉత్తర, దక్షిణ అమెరికాలు యురేషియా, ఆఫ్రికాల నుంచి వేరుపడి పశ్చిమంగా జరిగి.. ప్రత్యేక ఖండాలుగా ఏర్పడ్డాయి. ద్వీప కల్ప భార తదేశం ఆఫ్రికా నుంచి విడిపోయి, భూమధ్యరేఖ వైపుగా ప్రయాణిం చి.. చివరగా యురేషియా ఖండంతో కలిసిపోయింది. ఆస్ట్రేలియా, అంటార్కిటికా నుంచి వేరుపడి... ఈశాన్యంగా ప్రయా ణించి, ప్రత్యేక ఖండంగా ఏర్పడింది. మడగాస్కర్ ఆఫ్రికా నుంచి వేరుపడి దీవిగా మారింది.

ఒకేరకమైన వృక్షజీవజాతులు:

ఖండాలు చలించాయనటానికి ఆధారంగా.. ప్రపంచ పటంలో మళ్లీ ఖండాలను ఒక దగ్గరికి చేర్చితే.. అవి ఒకదానిలో ఒకటి అమరి, పాంజియా రూపొందుతుందని వెజనర్ చూపించాడు. ప్రపంచ పటం లోని ఈశాన్య బ్రెజిల్ ఉబ్బుప్రాంతం... ఆఫ్రికాలోని గినియా సింధు శాఖలోకి కచ్చితంగా అమరుతుంది. అయితే, 200 మిలియన్ సంవత్సరాల క్రితం విడిపోయిన ఖండభాగాల తీర రేఖలు... తీవ్ర మైన క్రమక్షయానికి గురై ఉంటాయి. అవి వాటి స్వరూపాన్ని కూడా కోల్పోతాయి. వాటిని ఇప్పుడు మళ్లీ కలిపితే అమరకూడదు. అయితే, వెజనర్ తన సిద్ధాంతాన్ని రుజువు చేసేందుకు శిలాజాల వివరాలను సేకరించాడు. ఈ సమాచారం ఆధారంగా... గోండ్వానా ప్రాంతమం తా ఒకేరకమైన వృక్ష జీవజాతులు నివసించేవని నిరూపించాడు. తద్వారా ఈ ఖండభాగాలన్నీ ఒకప్పుడు కలిసి ఉండేవని అభిప్రాయ పడ్డాడు. అయితే, ఒకేరకమైన శీతోష్ణస్థితి ఉన్న ప్రాంతాల్లో.... ఒకేరక మైన జీవజాతులు వృద్ధిచెందే అవకాశముందని విమర్శకులు అభిప్రా యపడుతున్నారు. మృధువైన ఖండపటలం (సియాల్)... దళసరిగా ఉండే సముద్రపటలం(సీమా)లోకి చొచ్చుకొని పోవటానికి వీలులేదు. ఈ కారణాల వల్ల ఖండచలన సిద్ధాంతం అందరి ఆమోదాన్ని పొంద లేకపోయింది.

విరూపణ సిద్ధాంతం:

1950ల నాటికల్లా ఆధునిక సముద్ర భూతల పరిశోధనల వల్ల లభ్య మైన సమాచారం... సముద్ర భూతలం విస్తరిస్తోందని నిర్ధారించింది. ఇందులో ఖండాలు, సముద్ర భాగాల విస్తరణను వివరించటానికి పలక విరూపణ సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టారు. ఈ సిద్ధాంతం ప్రకా రం... భూపటలం చిన్న చిన్న ముక్కలుగా ఖండనకు గురై ఉంది. వీటి ని ఆస్మావరణ పలకలుగా వ్యవహరిస్తారు. ఖండాలు, సముద్రాలు ఉన్న ఈ ఆస్మావరణ పలకలు... స్నిగ్ధత కూడిన ఆస్టినో ఆవరణ పొర లో పడవల మాదిరిగా తేలుతున్నాయి.

ఆస్థినో ఆవరణంలో సంవాహన ప్రవాహాలు ఉన్నాయి. ఉష్ణోగ్రతా వ్యత్యాసాల వల్ల ఇవి ఏర్పడతాయి. సంవాహన ప్రవాహాల వల్ల చోది తమై, ఆస్మావరణ పలకలు వివిధ దిశల్లో చలిస్తుంటాయి. అంటే... ఆస్మావరణ పలకల మీద ఉన్న ఖండాలు, సముద్రాలు చలిస్తున్నా యన్నమాట. పలకలు చలిస్తున్నప్పుడు కొన్ని సందర్భాల్లో ఇవి ఒక దానికొకటి అభిసరణం చెందుతాయి. మరికొన్ని సందర్భాల్లో ఇవి అపసరణం చెందుతాయి.. లేదా సమాంతరంగా ప్రయాణిస్తుం టాయి.

సముద్ర పలకతో అభిసరణం:

పలకల చలనం అభిసరణ, అపసరణ, సమాంతర సరిహద్దులు ఏర్ప డతాయి. ఈ సరిహద్దుల వల్ల పర్వతోద్భవనం, ద్వీపవక్రతల సృష్టి, అగ్నిపర్వత ప్రక్రియ, భూకంపాలు సంభవిస్తున్నాయి. అంటే... నైస ర్గిక స్వరూపాల ఆవిర్భావం, అగ్నిపర్వత, భూకంప ప్రక్రియలను అర్థం చేసుకోవటానికి పలకల సరిహద్దులను గుర్తించాలన్నమాట. యురేషియా ఖండపలక ద్వీపకల్ప భారత ఖండ పలకతో అభిసరణం చెందటం వల్ల... సరిహద్దు ప్రాంతంలో పర్వతోద్భవనం జరిగి, హిమాలయ పర్వత శ్రేణులు ఆవిర్భవించాయి. ఉత్తర-దక్షిణ అమె రికా ఖండ పలకలు.. పసిఫిక్ సముద్ర పలకతో అభిసరణం చెందటం వల్ల.. రాకీ పర్వతాలు, ఆండీస్ పర్వతాలు ఏర్ప డ్డాయి.

మిడ్ ఓషియానిక్ రిడ్జ్:

పసిఫిక్ సముద్ర పలక... చిన్న చిన్న కరోలిన్, బిస్మార్క్, ఫిలిప్పైన్ సముద్ర పలకలతో అభిసరణం చెందటం వల్ల పసిఫిక్ మహాసము ద్రంలో అగ్నిపర్వత ద్వీపవక్రతలు ఏర్పడ్డాయి. జువాన్ డిప్యుకా పలక, ఉత్తర అమెరికా పలక... సమాంతరంగా చలించటం వల్ల.. యుఎస్ఎ పసిఫిక్ తీరంలోని కాలిఫోర్నియా ప్రాంతంలో.. సాన్ ఆండ్రియాన్ భ్రంశం ఏర్పడింది. అట్లాంటిక్ మహాసముద్ర భూతలం పైన మధ్య భాగంలో.. పలకలు అపసరణం చెందటంతో సముద్ర పటలం విచ్చి న్నమై.. లావా పెల్లుబికి, మిడ్ ఓషియానిక్ (అట్లాంటిక్) రిడ్జ్ ఏర్ప డింది. పసిఫిక్ పరివేష్టిత అగ్నిపర్వత వలయం, తరచుగా భూకం పాలు సంభవించే ప్రాంతాలన్నీ అభిసరణ లేదా అపసరణ సరిహద్దుల వద్దే కేంద్రీకృతమై ఉన్నాయని గమనించాలి.

ఉదాహరణకు జపాన్, కుర్లీ, కొరియా, సఖాలిన్, ఫిలిప్పీన్స్, ఇండోనేసియా, న్యూజిలాండ్, ఆండీస్ పర్వతాలు, మధ్య అమెరికా మొదలైనవి. యురేషియా ఖండంలో తరచుగా తీవ్ర భూకంపాలు సం భవించే టర్కీ, ఇరాన్, అఫ్ఘానిస్థాన్, భారతదేశంలోని జమ్ము కాశ్మీర్, అరుణాచల్ ప్రదేశ్ తదితర ప్రాంతాలన్నీ కూడా పలక సరిహద్దు వద్ద ఉండటం గమనార్హం. సాన్ ఆండ్రియిస్ భ్రంశం ఏర్పడిన సమాంతర సరిహద్దు (కాలిఫోర్నియా) వద్ద కూడా తరచుగా తీవ్ర భూకంపాలు సంభవిస్తున్నాయి!!

Close