-->

భారత నైసర్గిక స్వరూపం - The natural appearance of India

Also Read



అనేక భాషలు, జాతులు, కుల మతాలు, ఆచారవ్యవహారాలు కల భారతదేశం... ఎంత వైవిధ్యభరితమైందో ... దాని నైసర్గిక స్వరూపం కూడా అంతే వైవిధ్యమైంది!! ఎత్తైన పర్వత శ్రేణులు, విశాలమైన పీఠ భూములు, విస్తృతమైదానాలు.. భారత్ లో వ్యాపించి ఉన్నాయి... పూర్తిగా ఉత్తరార్ధగోళంలో ఉన్న ఈ దేశానికి.. ఉత్తరాన హిమాలయ పర్వతాలు.. దక్షిణాన హిందూ మహాసముద్రం.. తూర్పున బంగా శాఖాతం.. పశ్చిమాన అరేబియా సముద్రం.. సరిహద్దులుగా ఉన్నాయి. సివిల్స్, ఏపీపీఎస్సీ గ్రూప్స్ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థుల కోసం భారత నైసర్గిక స్వరూపంపై సమాచారం..
దేశ ఉత్తర సరిహద్దుగా విస్తరించిన హిమాలయ పర్వతాలు.. నవీన ముడత పర్వతాలు... ఇవి టెరిషరీ యుగానికి చెందినవి. అంటే... దాదాపు 60 మిలియన్ ఏళ్ల క్రితమే ఏర్పడ్డాయి. హిమాలయ పర్వతోద్భవం.. ఆల్ఫైన్, జాగ్రోస్, హిందూకుష్ పర్వతపంక్తుల ఆవి ర్భావంతో ముడిపడి ఉంది. యురేషియా ఖండం భారత ద్వీపకల్పం తో ఢీకొనడం వల్ల హిమాలయాలు ఏర్పడ్డాయి. ఈ పర్వత శ్రేణులున్న చోట గతంలో 'టెధీస్' సముద్రం ఉండేది.
హిమం అంటే సంస్కృతంలో మంచు మంచుకు నిలయమైన ఈ ప్రాంతానికి హిమాలయాలనే పేరు వచ్చింది. హిమాలయ పర్వత శ్రేణులు భారత్, భూటాన్, పాకిస్థాన్, అఫ్ఘానిస్థాన్, నేపాల్, చైనాల్లో (ఆరు దేశాలు) వ్యాపించి ఉన్నాయి. ప్రస్తుతం యురేషియా- భారత ద్వీపకల్ప ఖండాల అభిసరణం చాలా నెమ్మదిగా జరుగుతోంది. దాంతో పర్వతోద్భవన రేటు చాలా తక్కు వగా ఉంది. అంటే... హిమాలయ పర్వతోద్భవనం అంత్యదశలో ఉం దన్నమాట!!
హిమాలయ పర్వత పంక్తులు పశ్చిమాన పాకిస్థాన్‌లోని పోట్వార్ తీరం నుంచి తూర్పున మయన్మార్-నాగాలాండ్ సరిహద్దుల వరకూ 5,200 కిలోమీటర్ల మేర విస్తరించాయి. ఇవి ఉత్తరాన టిబెట్ పీఠభూమి, దక్షిణాన గంగ బ్రహ్మపుత్ర మైదానాల మధ్య వ్యాపించి ఉన్నాయి. తూర్పు-పడమరలుగా... హిమాలయ పర్వతాలను 1)పం జాబ్, కాశ్మీర్ హిమాలయాలు 2) కుమవున్, గద్వాల్ హిమాలయాలు 3)నేపాల్ హిమాలయాలు 4) అరుణాచల్, అసోం హిమాలయాలుగా విభజిస్తారు. ఇవి వరుసగా సింధూ-సట్లేజ్, సట్లేజ్-కాళి, కాళి-తీస్తా, తీస్తా-బ్రహ్మపుత్ర నదుల మధ్య విస్తరించి ఉన్నాయి..
భారత్ లో.. కాశ్మీర్ లోని కారకోరం, జస్కర్, లడఖ్ పర్వత శ్రేణులు టిబెటన్ హిమాలయాల కోవకు చెందినవి. కారకోరం పర్వతాలను ఆసియా ఖండం వెన్నెముకగా పేర్కొంటారు. టిబెటన్ హిమాల యాల సగటు ఎత్తు 4500 మీటర్లు. ఇందులో 7000 మీటర్ల కంటే ఎక్కువ ఎత్తైన పర్వత శిఖరాలు అనేకం ఉన్నాయి. ఉదా: కె2/గాడ్విన్ ఆస్టిన్, నంగపర్వత, నామ్చాబారుమా. టిబెటన్ హిమాలయాలలో అనేక హిమనీనదాలు, హిమనీనద సరస్సులు ఉన్నాయి. ఉదా: సియాచిన్ (హిమాలయాలలో అతి పెద్దది), జైపూ, కైలాస మానస సరోవ రం, రాకాతాల్ మొదలైనవి.

గ్రేటర్ హిమాలయాలు:

అన్నిటికంటే ఎత్తైనవి మధ్యగ్రేటర్ హిమాలయాలు. వీటి సగటు ఎత్తు 6000 మీటర్లు. ఇవి అవిచ్ఛిన్న పర్వతశ్రేణిగా ఏర్పడ్డాయి. జమ్మూకాశ్మీర్ నుంచి అరుణాచల్ ప్రదేశ్ వరకు విస్తరించాయి. ప్రపం చంలోనే ఎత్తైన పర్వతశిఖరాలు ఎవరెస్టు, నందాదేవి, గైరీశంకర్, మకాలు, కామెత్ మధ్య గ్రేటర్ హిమాలయాల్లోనే ఉన్నాయి. గం గోత్రి, యమునోత్రి, పిండామ్ తదితర హిమనీనదాల జన్మస్థానం కూడా ఇదే ! జమ్మూకాశ్మీర్ లోని గ్రేటర్-టిబెటన్ హిమాలయాల మధ్య సన్నని మైదానాలు ఉన్నాయి. ఉదా: దేవసాయి మైదానాలు.

నిమ్న హిమాలయాలు:

వీటి సగటు ఎత్తు 2500 మీటర్లు. వీటిని వివిధ ప్రాంతాలలో వేర్వేరు పేర్లతో పిలుస్తారు. ఉదా: పి పంజాల్ పర్వాతాలు ( జమ్మూకాశ్మీర్), దవులాధార్ పర్వతాలు (హిమాచల్ ప్రదేశ్), ముస్సోరి కొండలు (ఉత్తరాఖండ్), మహాభారత్, నాగాటిబ్బా పర్వతాలు (నేపాల్). శీతాకాలంలో ఈ పర్వతాలను మంచు కప్పే స్తుంది. వేసవి కాలంలో ఇక్కడి వాతావరణం ఆహ్లాదకరంగా ఉం టుంది. దాంతో ఇది వేసవి విడిది కేంద్రాలకు పేరుగాంచింది. ఉదా: సిమ్లా, కులూ, మనాలి, నైనిటాల్, డార్జిలింగ్. నిమ్న హిమాలయ సానువుల్లో దట్టమైన కోనిఫర్ అడవులున్నాయి.

శివాలిక్ పర్వతాలు:

శివాలిక్ పర్వతాల సగటు ఎత్తు 1000-1500 మీటర్లు మాత్రమే. అందుకే వీటిని ఉప హిమాలయాలుగా పరిగణిస్తారు. ఇతర హిమా లయ పర్వత పంక్తులు శంఖాకార శిఖరాలను కలిగి ఉంటే... శివాలిక్ పర్వతాలు కురచగా ఉంటాయి.
వీటిని జమ్మూకాశ్మీర్ లో జమ్మూ కొండలని.. ఉత్తరాఖండ్, నేపాల్ లలో శివాలిక్ కొండలని పిలుస్తారు. అస్సాం, అరుణాచల్ ప్రదేశ్ లలో ఇవి అంతగా అభివృద్ధి చెందలేదు. శివాలిక్ పర్వతాలు దట్టమైన సమ శీతోష్ణ మండల ఆయనరేఖా ఆకురాల్చే అరణ్యాలకు ప్రసిద్ధి. హిమా లయ నదులు శివాలిక్ పర్వతాలను ఛేదించుకుంటూ... లోతైన ఇరుకు ద్వారా ప్రవహిస్తాయి. నిమ్న హిమాలయాలు, శివాలిక్ కొం డల మధ్య ఉన్న సరస్సు హరివణాలను 'డూన్'లని పేర్కొంటారు. ఉదా: డెహ్రాడూన్. శివాలిక్ పర్వతాలు, గంగా మైదానం మధ్య గిరిపద మైదానం ఏర్పడింది. గిరిపద మైదానాన్ని 'బబ్బర్', 'తెరా యి' మైదానాలుగా విభజించారు. బబ్బర్ మైదానం గులకరాళ్లు, ఇసు కతో నిండి ఉంది. తెరాయి మైదానం మాత్రం చిత్తడి నేలలకు ప్రసిద్ధి. తెరాయి మైదానంలో దట్టమైన రుతుపవన అరణ్యాలున్నాయి. జిమ్ దారులకార్బేట్, రాజాజీ నేషనల్ పార్కులు తెరాయి మైదానంలోనే ఉన్నాయి.

గంగ-సింధు-బ్రహ్మపుత్ర మైదానం:

గంగ-సింధు-బ్రహ్మపుత్ర మైదానం 1.5-2.5 మిలియన్ ఏళ్ల క్రితం ఏర్పడింది. ఈ మైదానంలో ప్రవహించే అనేక నదులు... తమ ఈ వరద మైదానాలను ఏర్పరచాయి. ఇవి సారవంతమైన ఒండ్రు మట్టిని కలిగి ఉండటంతో ఇక్కడ వ్యవసాయం బాగా అభివృద్ధి చెందింది. వీటిని 'కద్దర్', 'బంగార్' మైదానాలుగా విభజించారు. కద్దర్ మైదా నాలు పల్లపు ప్రాంతాలు. ఇవి తరచుగా వరద ముంపునకు గురవు తుండటంతో.. తాజా ఒండ్రుమట్టి వచ్చి చేరుతుంది. వరద మైదా నాల్లో ఎత్తైన ప్రాంతాలు బంగార్లు. ఇక్కడ వరద ముంపు అరుదు. దాంతో ఈ ప్రాంతాల్లో పాత ఒండ్రు మట్టే ఉంటుంది. నదీమైదాన ప్రాంతంలో.... నదుల మధ్య ఉండే నదీ విభాజక ప్రాంతాలను 'డోబ్' లని పిలుస్తారు.

బాగార్:

పశ్చిమ రాజస్థాన్ లోని థార్ ఎడారి.. సింధూ మైదాన ప్రాంతానికి చెందినది. ఆరావళి పర్వతాలకు ఆనుకొని ఉన్న ఈ ఎడారి ప్రాంతం పాక్షికంగా శుష్క మండలం. దీన్ని 'బాగార్' ప్రాంతంగా పిలుస్తారు. ఇక్కడి అనేక ఎడారి నదులు, ఉప్పునీటి సరస్సులలోకి ప్రవహిస్తు న్నాయి. ఈ ప్రాంతంలో సాంబార్, శబర్, దీద్వానా తదితర ఉప్పు నీటి సరస్సులు ఉన్నాయి. 'లూనీ' అన్నిటికంటే పెద్ద ఎడారి నది. బాగారు పశ్చిమంగా.. పాకిస్తాన్‌లోని సింధ్ రాష్ట్రాన్ని ఆనుకొని ఉన్న థార్ ఎడారి ప్రాంతాన్ని 'మరుస్థలి' అని అంటారు.

ద్వీపకల్ప పీఠభూమి:

భారతదేశంలో అన్నిటికంటే అతిపెద్ద నైసర్గిక విభాగం.. ద్వీపకల్ప పీఠభూమి ప్రాంతమే! ఇది చిన్న, పెద్ద పీఠభూములు, కొండలు, నదీలోయలతో నిండి ఉంది. ఉత్తరాన గంగా మైదానం, ఈశాన్యంలో రాజమహల్ కొండలు, వాయవ్యాన ఆరావళి కొండలు, పశ్చిమాన పశ్చిమ కనుమలు, తూర్పున తూర్పు కనుమలు, దక్షిణాన కన్యాకు మారి మధ్య ద్వీపకల్ప పీఠభూమి విస్తరించి ఉంది. ఇది అత్యంత పురాతన ఆర్కియాన్ ( కాంబియన్) మహాయుగపు శిలలతో ఏర్ప డింది. దక్కన్ పీఠభూమి ప్రాంతం స్థిరమైన శిలావరణం.

Close