-->

హిమాలయ పర్వత వ్యవస్థ.... ప్రాధాన్యం - The Himalayan mountain system

Also Read

హిమాలయ పర్వత వ్యవస్థ.. ప్రాధాన్యం

ఉత్తరాన కోటగోడవలె విస్తరించి ఉన్న హిమాలయ పర్వత వ్యవస్థ భారత దేశానికి పాకిస్థాన్, చైనా, నేపాల్, భూటాన్ దేశాలతో సరిహ దుగా ఏర్పడి ఉంది. వ్యూహాత్మకంగానే కాకుండా ఆర్థిక- సామాజిక అంశాల పరంగా కూడా హిమాలయ పర్వతాలు భారతదేశానికి కీలకం. భారతదేశానికి ఉత్తరప్రాంతం నుంచి సైనిక దాడిని నిరోధించి రక్షణ కల్పించడంలో హిమాలయాలు ప్రధానపాత్రను పోషిస్తున్నా యి. తూర్పు హిమాలయ ప్రాంతంలో భారత్-చైనాలను విడదీసే 'మెక్ మోహన్ రేఖ'ను శాస్త్రీయ సరిహద్దుగా అభివర్ణిస్తారు. ఈ ప్రాంతంలో హిమాలయ పర్వతాలు, వాటి కనుమలను పూర్తిగా భార తదేశం కిందకు తేవడంతో చైనా ఈ ప్రాంతంలో భారత్ లోకి చొచ్చుకు రావడం చాలా కష్టం. అందువల్లే చైనా మెక్ మోహన్ రేఖను అంగీకరిం చడం లేదు. చైనా వాదన ప్రకారం ఈ ప్రాంతంలో అంతర్జాతీయ సరిహద్దు హిమాలయ పర్వత పాదాల వద్ద ఉండాలి. అంటే మొత్తం హిమాలయ పర్వతాలను (అరుణాచల్ ప్రదేశ్ ను) చైనా కోరుతున్న దన్నమాట. ఇది భారత్ కు ఎట్టి పరిస్థితుల్లోనూ సమ్మతం కాదు. సైనిక వ్యూహాల పరంగా హిమాలయ పర్వతాల్లోని కనుమలు చాలా ప్రాధా న్యాన్ని కలిగి ఉంటాయి. 1962 యుద్ధం లో అరుణాచల్ హిమాలయా ల్లోని తవాంగ్, బొమిడిల్లా కనుమలను రక్షించుకోలేకపోవడం వల్లే చైనా సైన్యాలు సులువుగా అరుణాచల్ ప్రదేశ్ లోనికి ప్రవేశించగలిగా యి. జమ్ము- కాశ్మీర్ హిమాలయాల్లోని కారకోరం కనుమ నుంచి భారత్, చైనా,పాక్ ఆక్రమిత కాశ్మీర్ (POK) భూభాగాల్లోకి సులువుగా ప్రవేశించ వచ్చు. 1980లలో POK మీదుగా చైనా-పాకిస్థాన్లను కలుపుతూ కారకోరం కనుమ గుండా రహదారి నిర్మాణం జరగడంతో భారత్ భద్రతకు ముప్పు ఏర్పడింది. అందువల్లే కారంకోరం కనుమకు సమీపంలోని సియాచిన్ హిమనీనద ప్రాంతంలో సైనిక బలగాలను మోహరించాల్సివచ్చింది. ఇటీవలి కార్గిల్ యుద్ధంలో కూడా జొజిల్లా కనుమకు ముప్పు ఏర్పడింది. శ్రీనగర్-లే జాతీయ రహదారికి సమీపంలో ఈ కనుమ ఉంది. జొజిల్లా కనుమ శత్రువుల ఆధీనంలోకి వెళితే భారతదేశం నుంచి లడఖ్ ను సులువుగా వేరు చేయ వచ్చు. ఈ ప్రమాదాన్ని గమనించే కార్గిల్ యుద్ధంలో జొజిల్లా కనుమ సమీపంలోని టైగర్ కొండ, ముష్ కోష్ లోయల్లో తిష్ట వేసిన సాయుధ ముష్కరులను హతమార్చడానికి భారత సైన్యం పెద్ద మూల్యాన్నే చెల్లించాల్సి వచ్చింది. 'బనిహాల్ కనుమ' గుండా జమ్ము-శ్రీనగర్ జాతీయ రహదారి వెళ్తుంది. అందువల్లే ఈ కనుమను 'కాశ్మీర్ లోయ ముఖద్వారం'గా పరిగణిస్తారు.

వాణిజ్య సాంస్కృతిక సంబంధాలు :

హిమాలయ పర్వతాల కనుమలు అనాదిగా వాణిజ్య - సాంస్కృతిక సంబంధాల్లో కూడా కీలక పాత్రను పోషించాయి. భారత దేశం నుంచి చైనాలోకి బౌద్ధమత వ్యాప్తి హిమాలయ పర్వత కనుమల గుండానే జరిగింది. సిక్కిం-టిబెట్ సరిహద్దులోని నాథూలా,జెలెబో కనుమల గుండా టిబెట్ రాజధాని లాసా, కోల్‌కత రేవు పట్టణాలను కలిపే రహదారి వెళ్తుంది. 1962 యుద్ధం తర్వాత ఈ రెండు కనుమల ద్వారా జరిపే వాణిజ్యాన్ని నిలిపివేశారు. ఇటీవల నాథూలా కనుమను తిరిగి వాణిజ్యానికి తెరిచారు. టిబెట్-నేపాల్-ఉత్తరాఖండ్ సరిహద్దు ప్రాం తంలోని 'లిపులేక్' కనుమ మార్గం అనాదిగా వాణిజ్యానికి ప్రసిద్ధి. 1962 యుద్ధం తర్వాత ఈ కనుమను కూడా మూసివేశారు.

శీతోష్ణస్థితి నియంత్రణ

భారతదేశపు శీతోష్ణస్థితిని నియంత్రించడంలో కూడా హిమాలయాలు కీలక పాత్రను పోషిస్తాయి. శీతకాలంలో సైబీరియా (రష్యా) నుంచి దక్షిణాసియా వైపు వీచే అతి శీతల పవనాలను హిమాలయాలు అడు కొని గంగా-సింధు-బ్రహ్మపుత్ర మైదానాన్ని హిమపాతం నుంచి కాపాడతాయి. హిమాలయాలు లేకపోతే సైబీరియా శీతల పవనాల వల్ల మన గంగా-సింధు-బ్రహ్మపుత్ర మైదానంలో శీతకాలంలో రబీ వ్యవసాయం సాధ్యపడేది కాదు. గంగ, యమున, సట్లెజ్, బ్రహ్మపుత్ర నదులు శీత కాలంలో గడ్డ కట్టుకుపోయేవి. అందువల్లే ఉత్తర మహా మైదాన ప్రాంతం ఉప ఆయనరేఖా అక్షాంశ ప్రాంతంలో ఉన్నప్పటికీ ఆయనరేఖా శీతోష్ణస్థితిని కలిగి ఉంది. భారతదేశంలో నైరుతి రుతు పవనాల చురుకుదనం శీతాకాలంలో హిమాలయాల్లో కురిసిన మంచు పరిమాణంపై ఆధారపడి ఉంటుంది.

జీవ నదులకు ఆలవాలం :

హిమాలయాల్లోని హిమనీనద సరస్సులు, హిమనీనదాలు, మంచుతో కప్పుకుపోయిన పర్వత శిఖరాలు అనేక జీవ నదులకు మాతృకలు. ఉదాహరణకు గంగోత్రి హిమనీనదం నుంచి గంగ, యమునోత్రి వద్ద యమున, రాకా తాల్ సరస్సు నుంచి సట్లెజ్, చాంమ్యుయాంగ్ హిమనీనదం నుంచి సింధు, వెరినాగ్ కొండల నుంచి జీలం, కైలాస మానససరోవరం వద్ద బ్రహ్మపుత్ర, కులూ కొండల్లో రావి నదులు ఆవిర్భవిస్తున్నాయి. హిమాలయాల్లో ఆవిర్భవించడం వల్ల ఈ నదు లన్నీ 'జీవనదులు'గా అవతరిం చాయి. అయితే ఇటీవల కాలంలో గ్లోబల్ వార్మింగ్ వల్ల హిమాలయ హిమనీ నదులు క్రమంగా కుంచించుకుపోవడం ఆందోళనను కల్గిస్తోంది. హిమాలయాల్లో రెండో అతి పెద్దదైన గంగోత్రి హిమనీనదం వేగంగా కుంచించుకు పోతోందని శాస్త్రజ్ఞులు నిర్ధారించారు. దీనివల్ల గంగానదిలో సమీప భవిష్యత్తులో వరద తీవ్రత పెరిగి దీర్ఘ కాలంలో క్రమంగా ఎండిపోయే ప్రమాదం ఉన్నదని శాస్త్రజ్ఞులు హెచ్చరిస్తున్నారు.

అటవీ, వన్యమృగ సంపద :

హిమాలయ పర్వత సానువులు దట్టమైన అరణ్యాలతో కూడి విశిస్టమైన అటవీ, వన్యమృగ సంపదను కూడా కలిగి ఉన్నాయి. హిమా లయ పర్వత సానువుల్లో వివిధ ఎత్తుల్లో వివిధ రకాల అర ణ్యాలు పెరుగుతున్నాయి. శివాలిక్ కొండల్లో ఆయనరేఖా ఆకురాల్చు అర ణ్యాలు, సమశీతోష్ణ అరణ్యాలు పెరుగుతున్నాయి. హిమాచల్ పర్వ తాల్లో (లెస్సర్ హిమాలయాల్లో) విశిష్టమైన కోనిఫెరస్ (శృంగాకా రపు) అరణ్యాలు ఉన్నాయి. నాణ్యమైన మెత్తని కలపనిచ్చే పైన్, ఫర్, స్పూన్, దేవదారు మొదలైన వృక్ష జాతులు ఇక్కడ పెరుగుతు న్నాయి. హిమాద్రి పర్వతాల(గ్రేటర్ హిమాలయాల) నిమ్న సాను వులు విశాలమైన పచ్చిక బయళ్లకు ప్రసిద్ధి. ఈ ప్రాంతాల్లో రోడో డెండ్రాన్ వంటి ఆకర్షణీయమైన పుష్ప జాతులతో పాటుగా విలువైన ఔషధ మొక్కలుకూడా లభిస్తాయి.
అరుదైన హిమాలయ ఎలుగుబంటి, కస్తూరి మృగం వంటి వన్య ప్రాణులు కూడా ఈ అరణ్యాల్లో సంచరిస్తున్నాయి. శివాలిక్ కొండలులెస్సర్ హిమాలయాల మధ్యలో విస్తరించి ఉన్న 'డూన్' ప్రాంతాలు, కాశ్మీర్ లోయ వంటి ప్రాంతాల్లో సాంద్ర వ్యవసాయం కేంద్రీకృతమై ఉంది. నిమ్న హిమాలయాల్లో పర్వత సానువుల వెంబడి ఆపిల్ వంటి పండ్ల తోటలను పెంచుతున్నారు. హిమాలయ పర్వతాల్లో వివిధ రకాల ఖనిజ నిల్వలున్నప్పటికీ, వాటి వెలికితీత ఆర్థికంగా లాభదా యకం కాదు. నదులు హిమాలయ పర్వతాలను దాటేటప్పుడు విశిష్ట మైన జల పాతాలను సృష్టిస్తాయి. ఇవి విస్తృతంగా జల విద్యుచ్ఛక్తి వనరుల ను కలిగి ఉన్నాయి. దూల హస్తి, సలాల్, చమేలి, కర్ణప్రయాగ్ ముఖ్యమైన జల విద్యుచ్ఛక్తి ఉత్పత్తి కేంద్రాలు.

Close