-->

రాష్ట్రంలో రహదారులు మృత్యుద్వారాలుగా మారాయి - పవన్ కళ్యాణ్

Also Read

  •  #JSPForAP_Roads హ్యాష్ ట్యాగ్ ద్వారా రెండున్నర కోట్ల మందికి మన రోడ్ల దుస్థితి చేరింది.
  • 6.2 లక్షలకుపైగా ట్వీట్లు వచ్చాయి.

    ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రోడ్ల అధ్వాన్న పరిస్థితిని ప్రజలు, ప్రభుత్వం ముందుకు తీసుకెళ్లాలని జనసేన పార్టీ #JSPForAP_Roads హ్యాష్ ట్యాగ్ తో మూడు రోజుల పాటు చేపట్టిన ఉద్యమం విజయవంతమైంది. లక్షలాది మంది ఈ ఉద్యమంలో పాల్గొని తమ ప్రాంతాల్లోని రోడ్లు ఏ విధంగా పాడైపోయి... ఎంత అధ్వాన్న స్థితిలో ఉన్నాయో తెలియజేశారు. రాష్ట్ర నలుమూల నుంచి రోడ్ల దుస్థితిని తెలియజేస్తూ శనివారం మధ్యాహ్నంకి దాదాపు 6 లక్షల 20 వేల ట్వీట్లు చేశారు. సోషల్ మీడియా ద్వారా దాదాపు రెండున్నర కోట్ల మంది ప్రజల ముందుకు ఈ సమస్యను తీసుకెళ్లగలిగాం.
    రాష్ట్రంలో ప్రతి జిల్లాల్లో రోడ్లు ఛిద్రమైపోయి ఉన్నాయి. సోషల్ మీడియాలో వచ్చిన ఫోటోలు, వీడియోలు చూశాను. కృష్ణా జిల్లా పామర్రు, పెడన నియోజకవర్గాల్లో రోడ్లు, విశాఖ జిల్లా పెందుర్తి నియోజకవర్గంలో రోడ్లు, అనంతపురం జిల్లా గుంతకల్లు నియోజకవర్గంలో రోడ్లు ఎంత అధ్వాన్నంగా ఉన్నాయో ఫోటోలతో సహా పోస్టులు చేశారు. తూర్పు గోదావరి జిల్లా కడియం ప్రాంతంలో అయితే పెద్ద పెద్ద గుంతలతో నీళ్లు నిండి పైరు వేసుకునేలా రోడ్లు తయారయ్యాయి. ఆ జిల్లాలోనే ఈ రోజు ఏజెన్సీ ప్రాంతంలో గోకవరం నుంచి గుర్రేడు-పాతకోట వెళ్తున్న ఆర్టీసీ బస్సుకి రోడ్డుపై ఉన్న గుంతలు కారణంగా రన్నింగ్ లోనే వెనక చక్రాలు ఉడిపోయాయి. బస్సులో ఉన్న 25 మంది ప్రయాణికులు తృటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. ఇక నెల్లూరు జిల్లా గూడూరు నియోజకవర్గంలో గజానికో గొయ్యి కనిపిస్తోంది. మనిషి కూర్చోనేంత గోతులు ఉన్నాయి. ప్రకాశం జిల్లా చీమకుర్తి ప్రాంతంలో రోడ్లు దారుణంగా ఉన్నాయి. అది ముఖ్యమైన కూడలి. గ్రానైట్ తరలించే వాహనాలు ఎక్కువగా వెళ్తుంటాయి. పశ్చిమగోదావరి జిల్లా దెందులూరు రహదారి పరిస్థితి గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. వైఎస్ఆర్ కడప జిల్లా రాజంపేటలో అయితే రహదారులు నరకకూపంలా మారాయి. కనీసం సొంత జిల్లాలో అయిన రోడ్లకు మరమ్మతులు చేయించలేకపోయారు. వైఎస్ఆర్ పేరును అవమానించేలా జిల్లాలో రోడ్ల పరిస్థితి ఉన్నాయి. తిరుపతి ప్రాంతంలో రహదారులు పాడైపోయి ఉన్నాయి ఆ మరమ్మతులకు నిధుల కోసం పార్టీ శ్రేణులు భిక్షాటన చేసి తమ నిరసన తెలిపాయి.

అందరికీ ధన్యవాదాలు - పవన్ కళ్యాణ్ 

        రాష్ట్రంలో రహదారులు మృత్యు ద్వారాలుగా మారాయి. అడుగుకో గుంత .... గజానికో గొయ్యిలా తయారై ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్లు తెరచి పాడైన రోడ్లను వెంటనే మరమ్మతులు ప్రారంభించి ప్రజల ప్రాణాలు కాపాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రోడ్ల దుస్థితిని ప్రజలకు, ప్రభుత్వానికి తెలియజేద్దాం అనే ఒకే ఒక్క పిలుపుతో ఈ ఉద్యమంలో పాల్గొన్న జనసేన నాయకులు, జనసైనికులు, వీరమహిళలకు, ఈ కార్యక్రమంలో పాలుపంచుకున్న ప్రతి ఒక్కరికీ పేరుపేరునా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.

Close