-->

రవీంద్రనాథ్ ఠాగూర్ వర్దంతి నేడు - 1941 ఆగష్టు 7న || Rabindranath Tagore | Biography, Poems, Short Stories

Also Read


*భారతదేశానికి జాతీయగీతాన్ని అందించిన కవి.. రవీంద్రనాథ్ ఠాగూర్ వర్దంతి నేడు..*
*★ఠాగూర్ గానూ,రవీంద్రునిగాను ప్రసిద్ధుడైన ఈయన తన"గీతాంజలి"కావ్యానికి సాహిత్యం లో నోబెల్ బహుమతిని అందుకున్నాడు. నోబెల్ బహుమతిని అందుకున్న మొట్టమొద టి ఆసియావాసి.*
*💎బాల్యము-విద్యాభ్యాసము..*
*■ వంగదేశంలో 1861 మే7 వ తేదీన దేవేంద్ర నాథ ఠాగూర్, శారదాదేవీలకు పద్నాలుగవ సంతానంగారవీంద్రనాథ్ ఠాగూర్ జన్మించాడు.  ఇతని బాల్యం చాలా చోద్యంగా గడిచింది. ఆముదం దీపం ముందు పుస్తకం పట్టుకొని కూర్చొని ఆవలిస్తూ కునికిపాట్లు పడుతూ చదివేవాడు. నిద్ర లేవగానే ఇంటి తోటలోకి పోయి ప్రకృతి సౌందర్యాన్ని చూచి ఆనందించే వాడు.కథలంటే చెవి కోసుకొనేవాడు.సామా న్య  దుస్తులతో, నిరాడంబరంగా పెరిగాడు. బాల్యంలో ఇంట్లోనే నాలుగు గోడల మధ్య ఉండవలసి రావటంతో ఆయనకు బయటి ప్రపంచం అద్భుతంగా తోచేది. ప్రపంచమొక రహస్యమనీ, ఆ రహస్యాన్ని తెలుసుకోవాలనీ కుతూహలపడేవాడు.*

*■ రవీంద్రుడు పాఠశాలలో చదవడానికి ఇష్టపడక ఇంటివద్దనే క్రమశిక్షణతో ప్రతి ఉదయం వ్యాయామం చేసి, లెక్కలు చేసి, చరిత్ర, భూగోళ పాఠాలను, సాయంత్రం చిత్రలేఖనం, ఆటలు, ఇంగ్లీషు  అభ్యసించే వాడు. ఆదివారాలలో సంగీత పాఠాలు, భౌతిక శాస్త్రం ప్రయోగాలు,సంస్కృత వ్యాకర ణం నేర్చుకొనేవాడు. బొమ్మలున్న ఆంగ్లనవల లను స్వయంగా చదివేవాడు. కాళిదాసు,  షేక్స్‌పియర్ రచనలు చదివాడు. భాషను క్షుణ్ణంగా అభ్యసించి మాతృభాష పట్ల అభిమానం పెంచుకొన్నాడు.*

*■రవీంద్రుడు ఇంగ్లాండులోఒకపబ్లిక్ స్కూలు  లో  చేరి, ప్రొఫెసర్ మార్లే ఉపన్యాసాలు విని ఆంగ్ల సాహిత్యంపై అభిరుచి పొంచుకొన్నాడు. సాహితీపరుల ప్రసంగాలు విని వారితో సంభాషించి నాటకాలకు, సంగీత కచేరీలకు వెళ్లి, ఆంగ్ల సంస్కృతీ సంప్రదాయాలు బాగా ఆకళించుకొన్నాడు. తన అనుభవాలను భారతికి లేఖలుగా వ్రాసేవాడు. రవీంద్రుడు ఇంగ్లండులో వుండగానే 'భగ్న హృదయం'అనే కావ్యాన్ని రచించాడు. అయితే ఇంగ్లండులో పద్దెనిమిది మాసాలు వుండి ఏ డిగ్రీనీ సంపా దించకుండానే స్వదేశానికి తిరిగి వచ్చాడు.ఆ తర్వాత 1883 డిసెంబరు 9 న మృ ణాలిని దేవీని వివాహమాడెను.*

*💎సాహితీవ్యాసంగం..*

*రవీంద్రుడు బాల్యంలోనే అనేక పద్యాలు, వ్యాసాలు, విమర్శలు ప్రచురించాడు. ఆయన రచించిన 'సంధ్యాగీత్'కావ్యాన్ని కవులందరూ మెచ్చుకొనేవారు. వందేమాతరం గీతాన్ని రచించిన బంకించంద్ర ఛటర్జీ కూడా రవీంద్రుని ప్రశంసించాడు. రవీంద్రుడు రచించిన భక్తిగీతాలను తండ్రి విని, వాటి ప్రచురణ కవసరమయిన డబ్బు ఇచ్చేవాడు. ఆ తరువాత రవీంద్రుడు విర్గరేర్ స్వప్న భంగ, 'sangeetha prabhata అనే కావ్యాలను రచించాడు. అలాగే ఆయన ఆత్మకథ : మై రెమినిసెన్సెస్.*

*💎గీతాంజలి..*

*■ రవీంద్రుని రచనలలో గీతాంజలి చాల గొప్పది. రవీంద్రుడు తాను బెంగాలీ భాషలో రచించిన భక్తిగీతాలను కొన్నింటిని ఆంగ్లంలో నికి అనువదించి'గీతాంజలి అనిపేరు పెట్టాడు. అది అనేక ప్రపంచ భాషలలోనికి అనువదించ బడింది.*

*● ప్రపంచ సాహిత్యంలో ఇది గొప్ప రచన. మానవుని కృంగదీసే నిరాశా నిస్పృహలను, సకల సృష్టిని ప్రేమభావంతో చూచి శ్రమ యొక్క గొప్పతనాన్ని సూచించే మహత్తర సందేశం గీతాంజలిలోని ముఖ్యాంశం.*

*●1913 వ సంవత్సరంలో సాహిత్యానికి సంబంధించి రవీంద్రుని గీతాంజలికే నోబెల్ బహుమతి లభించింది.*

*●విశ్వకవి అనే బిరుదును సాధించి పెట్టింది.*

*●ఆసియా ఖండంలో మొదటిసారి నోబెల్ బహుమతి పొందిన వ్యక్తి.*

*●గీతాంజలి వెలువడిన తరువాత అన్ని దేశాలవారు రవీంద్రుని గ్రంథాలను చదవడం ఆరంభించారు.*

*💎శాంతి నికేతన్..*

*■ రవీంద్రుడు కేవలం రచయితగానే ఉండిపోక, బాలల హృదయాలను వికసింపచేయటానికై ప్రాచీన మునుల గురుకులాల తరహాలోనే శాంతినికేతన్‌గా ప్రసిద్ధి గాంచిన విశ్వభారతి విశ్వవిద్యాలయాన్ని స్థాపించాడు.* 

*■ అది అయిదుగురు విద్యార్థులతో మొదలై, క్రమంగా విస్తరించింది. చిన్న పిల్లలు ఉపాధ్యాయుల ఇళ్ళల్లో భోజనం చేసేవారు. ప్రాతఃకాలానే నిద్ర లేవడం, కాలకృత్యాలు తీర్చుకొని, తమ గదులను తామే శుభ్రపరచు కొని స్నానం చేయడం, ప్రార్థన చేయటం, నియమిత వేళలలో నిద్ర పోవటం వారి దినచర్య. ఆరోగ్యం కాపాడుకోవటం, పరిశుభ్రత, సత్యాన్నే పలుకుట, కాలినడక, పెద్దలను, గురువులను గౌరవించటం వారికి నేర్పేవారు.* 

*★1919 లొ కళాభవన్ ను ఆయన స్తాపించారు. ఇక్కడ విద్యార్ఢులు విభిన్న కళాలను నెర్చుకునెవారు.*

*💎నవల,నాటకాలు..*📕

*■ గ్రామాభ్యుదయమే దేశాభ్యుదయమని రవీంద్రుడు భావించాడు. అందుకై శ్రీ నికేతాన్ని నెలకొల్పి, గ్రామ పునర్నిర్మాణానికి ఎంతో కృషి చేసేవాడు.రవీంద్రుడు మొదట'వాల్మీకి ప్రతిభ' అనే నాటకాన్ని రచించాడు. ఆ తరువాత అమల్ అనే పిల్లవాణ్ణి గురించి 'పోస్టాఫీసు' అనే నాటకం వ్రాశాడు. రవీంద్రుడు రచించిన 'చిత్రాంగద నాటకం' ఆయనకు మంచిపేరు తెచ్చింది. 'ప్రకృతి - ప్రతీక' అనే నాటకంలో ప్రపంచాన్ని విడిచి పెట్టిన సన్యాసి కథను వర్ణించాడు. రవీంద్రుడు కచదేవయాని, విసర్జన, శరదోత్సవ్, ముక్తధార, నటిర్‌పూజ మొదలగు అనేక శ్రేష్ట నాటకాలు రచించాడు.*

*◆ మతాలు వేరైనా పరస్పర స్నేహంతో కలసి మెలసి ఉండాలి అనే సాంఘిక ప్రయోజనం, ఉత్తమ సందేశం మిళితమైన 'గోరా' నవల రవీంద్రునికెంతో పేరు తెచ్చింది.*

*💎చిత్రకళ, సంగీతం..*🎼

*■రవీంద్రుడు డెబ్భై ఏళ్ళ ప్రాయంలో చిత్రకళా సాధనను ప్రారంభించాడు. ఆయన వేసిన చిత్రాలులండను,ప్యారిస్, న్యూయార్కు  మొదలగు నగరాలలో ప్రదర్శించబడ్డాయి. ఆయన దాదాపు రెండు వేల చిత్రాలను గీశాడు.*

*■ రవీంద్రుడికి సంగీతమంటే మిక్కిలి ప్రీతి. ఆయన బెంగాల్ జానపద గీతాలను, బాపుల్ కీర్తనలను విని ముగ్ధుడయ్యేవాడు. ఆయన స్వయంగా గాయకుడు. భారతీయ సంగీతంలో రవీంద్ర సంగీతం అనే ప్రత్యేక శాఖను ఏర్పరచిన వాడు రవీంద్రుడు.*

*💎స్వాతంత్ర్య సాధన,జనగణమణ..*

*■ రవీంద్రుడు మొదటి నుండి జాతీయ భావాలున్నవాడు. హిందూ మేళాలో దేశభక్తి గీతాలను పాడాడు. పృథ్వీరాజు పరాజయం గురించి ప్రబోధాత్మక పద్యనాటకాన్ని రచించాడు. బ్రిటీష్ ప్రభుత్వం తిలక్‌ను నిర్భంధించినపుడు రవీంద్రుడు తీవ్రంగా విమర్శించాడు. బెంగాల్ విభజన ప్రతిఘట నోద్యమంలో రవీంద్రుడు ప్రముఖపాత్ర వహించాడు. జాతీయ నిధికి విరాళాలు వసూలు చేశాడు. టాగోర్ 1896లో జరిగిన కలకత్తా కాంగ్రెస్ సదస్సులో మొట్టమొదటిగా బంకించంద్ర చటర్జీ రచించినవందేమాతరాన్ని ఆలపించాడు.రవీంద్రుడువ్రాసిన జనగణమణ  ను జాతీయ గీతంగా ప్రకటించేముందు "వందేమాతరం", "జనగణమన" లపై దేనిని జాతీయ గీతంగా ప్రకటించాలని సుదీర్ఘ చర్చ, తర్జన భర్జనలు జరిగాయి. అంతిమంగా రవీంద్రుడి 'జనగణమన' దే పైచేయి అయింది. దీంతో రాజ్యాంగ సభ కమిటీ అధ్యక్షుడు  బాబూ రాజేంద్ర ప్రసాద్ 1950 జనవరి 24న జనగణమనను జాతీయ గీతంగా, వందేమాతరంను జాతీయ గేయంగా ప్రకటించాడు. అదే సమయంలో రెండూ సమాన ప్రతిపత్తి కలిగి ఉంటాయని స్పష్టం చేసాడు.*

*💎రచనల నుండి ఉదాహరణ..*

గీతాంజలి లోని ఈ కింది గీతం మహాత్మా గాంధీకి మిక్కిలి అభిమాన పాత్రమైంది.

*ఈ మంత్రములు జపమాలలు విడిచిపెట్టు*
*తలుపులన్నింటినీ బంధించి,*
*ఈ చీకటిగదిలో ఎవరిని పూజిస్తున్నావు?*
*కళ్ళు తెరచి చూడు.*
*నీవు ఆరాధించే దేవుడు*
*నీ ఎదుట లేడు!*
*ఎచ్చట రైతు నేలను దున్నుతున్నాడో,*
*ఎచ్చట శ్రామికుడు రాళ్ళు* *పగులగొట్టుతున్నాడో,*
*అక్కడ ఆ పరమాత్ముడున్నాడు.*
*వారితో ఎండలో, వానలో ధూళి* *ధూపరితములైన వస్త్రములలో ఉన్నాడు.*
*నీవు కూడా నీ పట్టు పీతాంబరములు ఆవల పెట్టి*
*ఆనేల మీదికి పదా.....*

*... విశ్వకవి' రవీంద్రనాథ్* టాగూర్, 1941 ఆగష్టు 7న మరణించాడు.

Close