భారత రాజ్యాంగ ప్రవేశిక అంటే ఏమిటి? || రాజ్యాంగ ప్రవేశిక ఎవరి నుంచి తీసుకున్నారు (What is a constitutional preamble? The constitutional preamble was taken from whom)
Also Read
రాజ్యాంగ ప్రవేశిక భారత దేశ ప్రజలమైన మేము భారతదేశాన్ని సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యంగా నిర్మించుకోవడానికి; పౌరులందరికీ సాంఘిక ఆర్ధిక రాజకీయ న్యాయాన్ని ; ఆలోచన, భావప్రకటన, విశ్వాసం, ధర్మం, ఆరాధనలలో స్వతంత్రాన్ని; అంతస్తులలోను, అవకాశాలలోను సమానత్వాన్ని చేకూర్చుటకు; వారందరిలో వ్యక్తి గౌరవాన్ని జాతీయ సమైక్యతను, సమగ్రతను సంరక్షించు సౌభ్రాతృత్వాన్ని పెంపొందించడానికి; 1949, నవంబరు 26న మన రాజ్యాంగ పరిషత్ లో ఎంపిక చేసుకుని శాసనంగా రూపొందించుకున్న ఈ రాజ్యాంగాన్ని మాకు మేమే సమర్పించుకుంటున్నాను. |
సర్వసత్తాక రాజ్యం
- అంతరంగిక బాహ్య విషయాలు విదేశీ శక్తులను లోనుగాక స్వతంత్రంగా వ్యవహరించే దేశం.
- భారతదేశం కామన్వెల్త్ ఐక్యరాజ్యసమితిలో సభ్యదేశమైనప్పటికీ ఆ సభ్యత్వం ఐచ్చికమైనది.
ప్రజాస్వామ్య రాజ్యం
- భారతదేశం ప్రజాస్వామ్యం రాజ్యమని తెలిపేది ప్రవేశిక.
- ప్రజల కొరకు, ప్రజలచేత, ప్రజల యొక్క ప్రభుత్వం ప్రజాస్వామ్యం.
- రాజ్యాంగం ప్రజలందరికీ తారతమ్యం లేకుండా 18 సంవత్సరాలు నిండిన వయోజనులకు ఓటు హక్కు కల్పించింది.
- కార్యనిర్వాహక వర్గం శాసనసభలకు బాధ్యత వహించాలి.
- అధికార వికేంద్రీకరణ పంచాయతీరాజ్ వ్యవస్థ ఏర్పాటు చేయడంలో గ్రామ స్థాయిలో కనిపిస్తుంది.
గణతంత్ర రాజ్యం
- ప్రజాస్వామ్య రాజ్యంలో రాజ్యాధినేత వంశపారంపర్యంగా వచ్చే రాజు/ రాణి ప్రజాప్రతినిధి ఉంటే ఆ రాజ్యం గణతంత్ర రాజ్యం అవుతుంది.
- ఈ పదవి ఎంపికకు కుల, మత, ప్రాంతీయ, లింగ వివక్షతలుండవు.
- ఇంగ్లాండ్ గణతంత్ర రాజ్యం కాదు.
లౌకిక రాజ్యం
- మత ప్రమేయం లేని రాజ్యం.
- కొన్ని దేశాలకు రాజ్యం మతం కలదు. ఉదా : ఇస్లాం మతం – పాకిస్తాన్, రోమన్ క్యాథలిక్ మతం – ఐర్లాండ్.
- లౌకిక అనే పదాన్ని ప్రవేశికలో 42వ రాజ్యాంగ సవరణ లో పొందుపరిచారు. (1976లో), భారతదేశం లౌకిక రాజ్యం ఎందువల్లనంటే – అధికార మతం లేదు
సామ్యవాద రాజ్యం.
- దేశ ప్రజలలోన ఆర్థిక అసమానతలను తగ్గించి వారి ఆర్థిక పురోభివృద్ధికే పాటుపడేది సామ్యవాద రాజ్యం.
- సామ్యవాద రాజ్యాంగ రూపొందాలని నిర్దేశించేది ప్రవేశిక.
- రాజ్యాంగ ప్రవేశికలో ” సామ్యవాదం” అనే పదాన్ని 42వ సవరణ లో పొందుపరిచారు. (1976)
సౌభ్రాతృత్వం
- అనగా సోదరభావం, పౌరుల మధ్య సంఘీభావం, వ్యక్తి గౌరవం ఉండాలి, ఈ పదాన్ని రాజ్యాంగ ప్రవేశికలో చేర్చాలని – ” బి ఆర్ అంబేద్కర్”.
- ఏకత & సమగ్రత అనగా భారత ప్రజల మధ్య ఐక్యతను పెంపొందించుటకు ఉద్దేశించినది.
- 1976 సంవత్సరంలో చేసిన 42 వ రాజ్యాంగ సవరణ ద్వారా సమగ్రత అనే పదం ప్రవేశికలో చేర్చారు.
- ప్రవేశిక కు సంబంధించిన సుప్రీం కోర్టు తీర్పులు :
1. బెరుబారి కేసు (1960) | • ప్రవేశిక రాజ్యాంగంలోని అంతర్భాగం కాదు. • బెరుబారి అనేది పాకిస్తాన్, భారతదేశం మధ్య గల ఒక ప్రాంతం. • ఈ ప్రాంతం పాకిస్తాన్ – భారత్ ల మధ్య మార్పిడి వలన ఏర్పడిన కేసు బెరుబారి కేసు. |
2. కేశవానంద భారతి కేసు (1973) | • ప్రవేశిక రాజ్యాంగంలో అంతర్భాగం. • ఈ కేసులో తీర్పు వెలువరించిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సిక్రీ. • ఇదే విధమైన అభిప్రాయాన్ని సుప్రీంకోర్టు మినర్వా మిల్స్ (1990) కేసు, ఎల్ఐసి ఆఫ్ ఇండియా కేసు (1995)లో ప్రకటించింది. |
3. S.R బొంబాయి కేస్ (1994). | • ప్రవేశిక రాజ్యాంగ మౌలిక స్వరూపంలో అంతర్భాగం. |
- ప్రవేశిక భారత ప్రజాస్వామ్యం గణతంత్రానికి రాజకీయ జాతక చక్రం – M మున్షి.
- ప్రవేశిక రాజ్యాంగ ఆత్మ, రాజ్యాంగాన్ని తాళంచెవి రాజ్యాంగము హృదయం, ఆభరణం – ఠాగూర్ దాస్ భార్గవ.
- ప్రవేశిక మన కలలకు ఆలోచనలకు రాజ్యాంగంలో వ్యక్తీకరించు నా అభిమతం – అల్లాడి కృష్ణస్వామి.
- ప్రవేశిక రాజ్యాంగంలో నిర్మాతల ఆశయాలు, లక్ష్యాలను తెలుసుకోవడానికి తాళంచెవి లాంటిది – డయ్యర్.
Post a Comment